- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ లో స్టాప్ నజ్మా, జాఫరిన్, సారిక డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ లో భాగంగా నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ నుండి నిజామాబాద్ కమిషనరేట్ కు బదిలీ అయ్యారని రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. పైఅధికారుల ఉత్తర్వుల మేరకు శుక్రవారం వారిని రిలీవ్ చేస్తూ ఘనంగా సన్మానించారు. ఇన్ని రోజులు వారు చేసిన మంచి పనులను మెచ్చుకొని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -