నవతెలంగాణ-హైదరాబాద్ : సరదాగా కుటుంబ సభ్యులంతా కలిసి రీల్స్ చిత్రీకరణ చేస్తున్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకొని ఆరుగురు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రాలోని యమునా నదిలో తీరంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు యువతులు రీల్స్ చేసుకుంటున్నారు. అదే సమయంలో రీల్స్ చేస్తూ.. నదిలో దిగగా.. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆరుగురు నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని యువతుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. ఆరుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ విషాద సంఘటన పై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది.
ఘోరం.. రీల్స్ చేస్తూ ఆరుగురు యువతులు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES