– ఒక నైజీరియన్, ఇద్దరు లోకల్ పెడ్లర్స్ అరెస్ట్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మణికొండ అల్కపూరి కాలనీలో టీ న్యాబ్, నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాస్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. విస్డం ఒనేకా అనే ఒక నైజీరియన్ నకిలీ పాస్ పోర్ట్తో నైజీరియా నుంచి హైదరాబాద్కు వచ్చాడు. కొంతకాలంగా అతడు గోవా నుంచి అక్రమంగా డ్రగ్స్ తీసుకొని వచ్చి హైదరాబాద్లోని పలు పార్టీలకు సరఫరా చేస్తున్నాడు. స్థానికంగా ఉన్న మణికొండకి చెందిన గోపిశెట్టి రాజేశ్, వెస్ట్ గోదావరికి చెందిన బొమ్మ దేవర వీరరాజుతో కలిసి ఈ దందాను కొనసాగిస్తున్నాడు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం అతని అపార్ట్మెంట్పై దాడి చేయగా డ్రగ్స్ లభ్యమయ్యాయి. అతనితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇటీవల మొయినాబాద్ ఫామ్హౌస్లో నిర్వహించిన ఒక పార్టీకి డ్రగ్ సరఫరా చేసినట్టు వారు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఏపీలోని ఒక వ్యక్తికి పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేశామని ఆ నైజీరియన్ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
నార్సింగ్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES