- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాల్పులకు విరమణకు అంగీకారం తెలిపిన కొన్ని గంటల్లోనే మాట తప్పిన పాకిస్థాన్ సైన్యం భారత్పై దాడి చేసింది. శనివారం రాత్రి పూంచ్ జిల్లా లోని ఆర్ఎస్ పుర సెక్టార్ లో భారత సైనిక స్థావరంపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు, ఒక ఎయిర్ఫోర్స్ జవాన్తోపాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్ఇన్స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ ప్రాణాలు కోల్పోయారు. మహ్మద్ ఇంతియాజ్ కుమారుడు ఇమ్రాన్ తన తండ్రి మరణంపై భావోద్వేగంతో స్పందించారు. తన తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించడం ఎంతో గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
- Advertisement -