నవతెలంగాణ – హైదరాబాద్: హనీమూన్లో తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిందన్న ఆరోపణలతో అరెస్టయిన సోనమ్ రఘువంశీ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య తాను చేయలేదని, తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీసుల విచారణలో సోనమ్ చెప్పినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సోనమ్ బాయ్ఫ్రెండ్గా అనుమానిస్తున్న రాజ్ కుశ్వాహాను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వర్గాల కథనం ప్రకారం, “ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎవరో కిడ్నాప్ చేసి, ఆ తర్వాత గాజీపుర్లో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచే నేను మా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాను” అని సోనమ్ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. గాజీపుర్లోని ఒక హోటల్ వద్ద నుంచే పోలీసులు సోనమ్ను అరెస్ట్ చేశారు. ఆమె తన ఫోన్ నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు హోటల్ సిబ్బంది కూడా ధృవీకరించారు. ఈ కేసులో సోనమ్తో సన్నిహితంగా ఉంటున్నాడని భావిస్తున్న రాజ్ కుశ్వాహా అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోర్కు చెందిన కుశ్వాహా, సోనమ్ సోదరుడు నడుపుతున్న ఒక కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడని మృతుడు రాజా రఘువంశీ సోదరుడు తెలిపారు. కొంతకాలంగా సోనమ్తో రాజ్ కుశ్వాహాకు సన్నిహిత సంబంధాలున్నాయని, అతని ప్రణాళిక ప్రకారమే ఆమె భర్తను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
నా భర్తను నేను చంపలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES