Thursday, June 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలు5న విచారణకు హాజరు కాలేను: కేసీఆర్

5న విచారణకు హాజరు కాలేను: కేసీఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: కాళేశ్వరం బ్యారేజీల్లోని అవకతవకలపై విచారణ చేస్తున్న కమిషన్‌ ఎదుట ఈ నెల 5న హాజరు కాలేనంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కమిషన్‌కు విన్నవించారు. మరో తేదీన వస్తానని, గడువు ఇవ్వాలని కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ను కోరారు. దీంతో కమిషన్‌ సానుకూలంగా స్పందించి… ఈ నెల 11న రావాలని సూచించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ మే 19న మాజీ సీఎం కేసీఆర్, నాటి మంత్రులు ఈటల రాజేందర్‌, తన్నీరు హరీశ్‌రావులకు నోటీసులు పంపిన విషయం తేలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -