- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ ఐసెట్ వెబ్కౌన్సెలింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్నది. ఈ సారి రెండు విడతల్లో సీట్లను భర్తీచేస్తారు. ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు బుధవారం విడుదల చేశారు.
మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఈ నెల 20న ప్రారంభమయ్యి.. సెప్టెంబర్ 5తో ముగుస్తుంది. తుది విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 8న ప్రారంభమై, 16తో ముగుస్తుంది. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను సెప్టెంబర్ 15న విడుదల చేస్తారు. కౌన్సెలింగ్ షెడ్యూల్, పూర్తి నోటిఫికేషన్ కోసం విద్యార్థులు https://tgicet.nic.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
- Advertisement -