– విశాఖలోని అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ బ్లాక్కు శంకుస్థాపన
నవ తెలంగాణ – హైదరాబాద్
విశాఖపట్నంలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ బ్లాక్ ఏర్పాటుకు ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) శంకుస్థాపన చేశాయి. ఇరు సంస్థలు సంయుక్తంగా హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (హెచ్బీసీహెచ్ఆర్సీ)లో కొత్త భవనాన్ని ఏర్పాటు చేయ నున్నాయి. దీని కోసం ఐసీఐసీఐ బ్యాంక్ రూ.550 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా, టాటా మోమోరియల్ సెంటర్ (ముంబయి) డైరెక్టర్ సుదీప్ గుప్తా సమక్షంలో ఐసిఐసిఐ బ్యాంక్ ఛైర్మన్ ప్రదీప్ కుమార్ సిన్హా కొత్త భవనం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాదాపు 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బ్లాక్ను ఏర్పాటు చేస్తున్నాయి. 2027 నాటికి పూర్తి కానున్న ఈ ఎనిమిది అంతస్తుల భవనం ఏడాదికి 3,000 మంది రోగులకు సేవలను అందించనుంది. ప్రస్తుత హెచ్బీసీహెచ్ఆర్సి ఏడాదికి 6,200 రోగులకు సేవలందిస్తోంది. కొత్త బ్లాక్లో 555 పడకలు ఉంటాయని సందీప్ బాత్రా తెలిపారు. విశాఖ, నవీ ముంబయి, న్యూ చండీగఢ్లో కొత్తగా మూడు టీఎంసీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తొలుత రూ.1200 కోట్ల విరాళం ఇవ్వాలని యోచించామని.. ప్రస్తుతం పెరిగిన అవసరాల రీత్య రూ.1,800 కోట్లకు పెంచుతున్నందుకు సంతోషిస్తున్నామన్నారు.
టీఎంసీకి ఐసీఐసీఐ బ్యాంక్ రూ.550 కోట్ల విరాళం
- Advertisement -
- Advertisement -