నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్గడ్లోని సుక్మా జిల్లాలో ఐఈడీ బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. కూబింగ్ ఆపరేషన్ చేపడుతోన్న పోలీసు వాహనాన్ని ఐఈడీతో బ్లాస్ట్ చేశారు. ఈ దుశ్చర్యలో ఏఎస్పీ ఆకాశ్ రావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా డీఎస్పీ (DSP)తో పాటు మరో సీఐ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన తోటి భద్రతా సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ బ్లాస్ట్కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. భద్రతా దళాలు మావోయిస్టుల ఏరివేతను ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే నారాయణపూర్ , బీజాపూర్ , సుక్మా జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
సుక్మాలో పేలిన ఐఈడీ.. ఏఎస్పీ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES