నవతెలంగాణ : అడ్డగూడూర్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకులు , బిజెపి నాయకులు బలపరిచిన సర్పంచ్ గా అడ్డగూడూరు స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి కడారి ఉపేంద్ర రమేష్ అన్నారు. అడ్డగూడూరులో శనివారం ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో తిరుగుతూ ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి సర్పంచిగా తను ఎన్నుకోవాలని అభ్యర్థించారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు కోతుల బెడదను , కుక్కల బెడద తీరాలంటే నాకు ఓటు వేసి గెలిపిస్తే నా సొంత ఖర్చులతో ఈ సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. డ్రైనేజీ సమస్యలను , వీధి దీపాలు , పెన్షన్లు రాని వాళ్లకు పెన్షన్లు కూడా వచ్చేలా చేస్తామన్నారు. దెబ్బతిన్న బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయించి నూతన రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు . మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెపు పాండు , గూడెపు నాగరాజు , మారిశెట్టి మల్లేష్ , బిజెపి నాయకులు కూరాకుల వెంకటేశ్వర్లు , నాగులపల్లి నరసయ్య, ఏనుగు బీరుమల్లు , వార్డు సభ్యులు మత్స్యగిరి , మహిళలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా : అడ్డగూడూరు స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



