- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఖండెబల్లూరు గ్రామ సంఘంలో వరి కొనుగోలు కేంద్రన్ని ఐకెపి ఏటీఎం గంగారం ఆధ్వర్యంలో బుధవారం నాడు గ్రామ సంఘం సభ్యులు ప్రారంభించడం జరిగింది. ఈ ఈ సందర్భంగా ఏటీఎం మాట్లాడుతూ మండలంలోని సుమారుగా 2000 ఎకరాలలో రైతులు వారి సాగు చేస్తున్నారని తెలిపారు.
వారి ఏ గ్రేడ్ కు రూ.2,389/-, సాధారణ వడ్లకు ఇతర ప్రకృతి వైపరీతం వలన పండిన వరికి 2369/- ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏపిఎం గంగారం, గ్రామ సంఘం ఓబీలు శాంతమ్మ అధ్యక్షురాలు, కార్యదర్శి పూర్ణమ్మ, సీసీలు, రాములు, సంజీవ్, తుకారం వివో ఏ గంగారం, గ్రామ పెద్దలు రైతులు తదితరు పాల్గొనడం జరిగింది.
- Advertisement -