- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హిమాయత్ నగర్లోని అలైడ్ ఆర్టిడ్స్ ఆడిటోరియంలో ఇళయరాజా పాటల విభావరి జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9:30 వరకు ఇళయరాజా స్వరపరిచిన పాటలను ప్రముఖ గాయనీ గాయకులు ఆలపిస్తారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సుప్రసిద్ధ సినీ దర్శకుడు వంశీ, ఫిలిం జర్నలిస్ట్ వి. శ్రీనివాస్, గాయకుడు ప్రవీణ్ కుమార్ కొప్పోలు, గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ హాజరవుతారు. ఈవెంట్స్ & ఎంటర్టైన్మెంట్స్ అధ్యక్షురాలు గాయని కె శ్రీదేవి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
- Advertisement -



