Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణితంతో విద్యార్థుల మేధస్సు మెరుగు

గణితంతో విద్యార్థుల మేధస్సు మెరుగు

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ  : గణితంతో విద్యార్థుల మేధస్సు మరింత మెరుగుపడుతుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి కృష్ణవేణి అన్నారు. మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు, మ్యాథ్స్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారుచేసిన గణిత నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -