Monday, June 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలియుగంలో మనసున్న వాడే మాహరాజు...

కలియుగంలో మనసున్న వాడే మాహరాజు…

- Advertisement -

– అనంత శ్రీ విభూషణ జగద్గురు రామానందచార్య శ్రీ స్వామి నరేంద్ర ఆచార్య మహారాజ్ క్షేత్రం నాని జ్ రామ్ దక్షిణపీఠం.
నవతెలంగాణ – జుక్కల్ 
కలియుగంలో మనసున్న వాడే మహారాజు అని  అనంత శ్రీ విభూషణ జగద్గురు రామానందచార్య శ్రీ స్వామి నరేంద్ర ఆచార్య మహారాజ్ క్షేత్రం నానిజ్  దామ్ దక్షిణ పీఠం స్వామీజీ అన్నారు. జుక్కల్ మండలంలోని దోస్పల్లి గ్రామంలో నెలకొల్పిన తెలంగాణలో నెలకొల్పిన ఉపపీఠం లో రెండవ రోజు ఏర్పాటు చేసిన సమస్య మార్గదర్శనం – దర్శన భాగ్యం, కార్యక్రమంలో స్వామీజీ బత్తుల నిర్దేశించి మాట్లాడారు. భక్తి ఉంటే ముక్తి లభిస్తుంది అని గుత్తితో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చునని భక్తులకు తాము శాంతంగా ఉంటూ ఇతరులకు ఎటువంటి నష్టం చేయకుండా మంచి శుభవంతు ఉన్నప్పుడే తమ పట్ల గౌరవం పెరుగు తుందని , అటువంటి వారికి సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని స్వామీజీ భక్తులకు మార్గదర్శనం చేశారు . ప్రతి మూడు నెలలకు ఒకసారి తెలంగాణ ఉపపీఠం లో భక్తులకు భక్తి పట్ల గౌరవం ఉండేందుకు ఉపపీఠంలో భక్తి కార్యక్రమాలు  మార్గదర్శనం  చేస్తున్నామని తెలిపారు . ప్రస్తుత పరిస్థితులలో చాలామంది దురాల్వాట్లకు దూరంగా ఉంటూ భక్తి మార్గాన్ని ఎంచుకొని సన్మార్గంలో ముక్తి పొందుతున్నారు అని ఇది నిజంగా మంచి పరిణామం స్వామీజీ అన్నారు.

జే ఎన్ ఎం ఎస్ సంస్థ ఆధ్వర్యంలో సామాజికంగా ఉన్న రుగ్మతలను పారదోలెందుకు తమ  సంస్థ పేదల పట్ల కృషి చేస్తుందని, ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షలాదిమందికి తమ సంస్థ ఆధ్వర్యంలో లక్షల లీటర్ల రక్తదానం భక్తుల ద్వారా సేకరించి వివిధ ఆసుపత్రులకు రక్తం బాటిల్లను పంపడం జరిగిందని పేర్కొన్నారు,   మూడ మూడో విశ్వాసాలను దరిచేనీయకుండా ఉండాలని, తమ ఆశయాలను తీర్చుకోవడానికి భక్తి మార్గం ఎంచుకోవాలని కార్యక్రమంలో హాజరైన భక్తులకు ప్రబోధించారు. సామాజిక సేవే తమ ధ్యేయమని ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు గుర్తించి వారికి అవసరం ఉన్నవి సమకూర్చితే ఎవరు ఈ పనులు చేస్తే వారిని భగవంతుడు కనికరిస్తారని ఆయన అన్నారు. ఇప్పటికైనా భక్తులు సన్మార్గంలో నడుచుకుంటూ తన తలరాతను తానే తిరగరాసుకోవాలని , భక్తి చేస్తే భగవంతుడు కూడా తనకు అన్ని మంచి జరిగే విధంగా అనుకూల వాతావరణం  ఏర్పడుతుందని సూచించారు. 

రెండవ రోజు కార్యక్రమంలో మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుండి భారీగా భక్తులు హాజరయ్యారు. ప్రాంగణంలో కొంతమంది చెట్ల కింద కూర్చుని గాంధీజీ ప్రభుత్వం తినలేను పాటిస్తే శాంతియుతంగా ప్రవచనాలను వినుకుంటు తిలకించారు . రెండవ రోజు కూడా వచ్చిన భక్తులకు మహా అన్న పసాదం , త్రాగునీరు ఇతర సౌకర్యాలను ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు వాలెంటరిగా భక్తులు విధులు నిర్వహించి ప్రశాంతంగా కొనసాగేందుకు కృషి చేశారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలియజేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -