- Advertisement -
నవతెలంగాణ-నవాబు పేట : మండల పరిధిలోని దేపల్లి గ్రామంలో నూతన మహిళా సంఘం భవనం గ్రామ సర్పంచ్ ప్రణవివెంకటేష్ గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో మహిళల ఆర్థిక పరంగా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



