- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గురువారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శుక్రవారం కూడా వర్షం కురుస్తుండటంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రతా దృష్ట్యా వివిధ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించింది. పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరింది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
- Advertisement -