– ఉత్తర్వులు జారీ
– 16,448 మంది సర్వీసుల పొడిగింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్య విద్యార్థుల ఉపకారవేతనాలు 15 శాతం మేరకు పెరిగాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టీనా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్తో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెరిగింది. పెరిగిన ఉపకారవేతనం, గౌరవ వేతనం 2025 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. పెంపునకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ.67,032, సెకండ్ ఇయర్లో రూ.70,757, ఫైనల్ ఇయర్లో రూ.74,482 చొప్పున స్టైఫండ్ అందనుంది. సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్లో రూ.1,06,461, సెకండ్ ఇయర్లో రూ.1,11,785, థర్డ్ ఇయర్లో రూ.1,17,103 చొప్పున స్టైఫండ్ అందనుంది. సీనియర్ రెసిడెంట్లకు డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచుతున్నట్టు జీవోలో పేర్కొన్నారు. హౌస్ సర్జన్ చేస్తున్న మెడికల్, డెంటల్ విద్యార్థులకు రూ.29,792 ఇవ్వనున్నారు. అదే విధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో మొదటి సంవత్సరం విద్యార్థుల స్టైఫండ్ ను రూ.67,032కు, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల స్టైఫండ్ ను రూ.70,757కు పెంచారు.
16,448 మంది సర్వీసుల పొడిగింపు
రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 16,448 మంది ఉద్యోగుల సర్వీసులను మరో ఏడాది పొడిగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు వీరి సర్వీసులను పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పోస్టుల్లో 4,772 కాంట్రాక్ట్, 8,615 అవుట్ సోర్సింగ్, 3,056 పోస్టులు పారితోషికం ప్రాతిపదికన, 5 పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు సంబంధించినవి ఉన్నాయి. ఈ పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రులు, నర్సింగ్, డెంటల్ కాలేజీలకు చెందినవి. ఆయా పోస్టుల్లో ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ వంటి బోధనా సిబ్బందితో పాటు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, పారామెడికల్ సిబ్బంది, డీఈవోలు, క్లాస్ 4తో ఇతర విధులు నిర్వహించే వివిధ క్యాడర్ల వారున్నారు. రెగ్యులర్ నియామకం జరిగేంత వరకు సిబ్బంది కొరత రాకుండా ఉండేందుకు ఈ పొడిగింపు చేపట్టినట్టు ఉత్తర్వులో వివరించారు.
వైద్యవిద్యార్థుల ఉపకార వేతనాలు పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES