– ఉమ్మడి వరంగల్ జిల్లాపై రూ.2కోట్ల భారం
– విద్యార్థులపై రూ. కోటి భారం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
విద్యార్థుల బస్పాసుల చార్జీలు, టోల్ ప్లాజా చార్జీలు పెంచడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థులు, ప్రజలపై అదనపు భారాలు పడనున్నాయి. బస్పాస్లను రూ.400 నుంచి రూ.600కు పెంచడంతో విద్యార్థులపై నెలకు రూ.200 భారం మోపబడుతున్నది. దీని పర్యావసానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 50 వేల మంది విద్యార్థులపై రూ. కోటి భారం పడుతుంది. ఇదిలావుంటే టోల్ప్లాజాల్లో ఒక్కో ప్రయాణికునిపై రూ.10 చార్జీలను పెంచారు. దాంతో వరంగల్-హైదరాబాద్ మార్గంలో రెండు టోల్ ప్లాజాలు ఉండటంతో ప్రతి ప్రయాణికునిపై రూ.20 భారం పడనుంది. భూపాలపల్లి-కాళేశ్వరం మధ్య ఒక టోల్ప్లాజా వుండటంతో ఒక్కో ప్రయాణికునిపై రూ.10 భారం పడుతుంది ఈ టోల్ప్లాజా చార్జీలతో వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రయాణికులపై రోజుకు రూ.3.22 లక్షలు, నెలకు రూ.96.75 లక్షల అదనపు భారం పడనున్నది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అసంతృప్తికి గురవుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 50వేల మంది విద్యార్థులకు బస్ పాసులున్నాయి. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో విద్యార్థుల బస్పాసుల చార్జీలు గతంలో రూ.400 ఉండగా తాజా పెంపుతో రూ.600కు చేరింది. దీంతో అదనంగా రూ.200 పెరిగింది. ఈ లెక్కన ప్రతినెలా 50 వేల మంది విద్యార్థులపై నెలకు రూ.కోటి భారం పడనుంది. అలాగే టోల్ ప్లాజా చార్జీల పెంపుతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రయాణికులపై రోజుకు రూ.3.22లక్షల అదనపు భారం పడుతుండగా, నెలకు రూ.96.75 లక్షల భారం పడనుంది. వరంగల్- హైదరాబాద్ రూట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 250 ట్రిప్పుల్లో ప్రయాణికులు సుమారు 15 వేల మంది ప్రతిరోజూ వెళ్తున్నారు. ఈ రూట్లో రెండు టోల్ప్లాజాలుండటంతో రూ.20 చార్జీ పడుతుంది. హైదరాబాద్కు వెళ్తే ప్రయాణికుల తోపాటు, హైదరాబాద్ నుంచి వరంగల్కు వచ్చే ప్రయాణికులపై నెలకు రూ.90 లక్షల భారం పడుతుంది. ఇదిలావుంటే కాళేశ్వరానికి వెళ్లే ప్రయా ణికులపై టోల్ప్లాజా ఉండటంతో రూ.10 చార్జీ అదనంగా పడనుంది. ప్రతిరోజూ 45 ట్రిప్పుల్లో 2,250 మంది కాళేశ్వరానికి తిరుగుతుంటారు. వారి పై రోజుకు రూ.22,500 చొప్పున నెలకు రూ.6.75 లక్షల భారం పడనుంది. మొత్తంగా విద్యార్థుల బస్పాసుల చార్జీల పెంపుతోపాటు టోల్ ప్లాజా చార్జీల పెంపుతో ఉమ్మడి వరంగల్ జిల్లాపై రూ.2 కోట్ల అదనపు భారం పడడటంతో అటు విద్యా ర్థులు, ఇటు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసు ్తన్నారు. విద్యార్థుల బస్పాసుల చార్జీల పెంపు పట్ల విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
స్టూడెంట్ బస్పాసులు, టోల్చార్జీల పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES