Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుతిరుమలలో పెరిగిన భక్తుల రద్ధీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్ధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : వేసవి సెలవులు ముగిసి బడులు ప్రారంభమయ్యే సమయం దగ్గర పడుతున్న కొద్ది తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల రద్ధీ పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా భారీగా భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పొటెత్తగా మధ్యలో రెండు రోజుల పాటు భక్తుల తాకిడి తగ్గింది. అయితే మళ్లీ ఈ రోజు భక్తుల రద్ధీ భారీగా పెరిగింది. గురువారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా నిన్న భక్తుల రద్ధీ సాధారణ స్థాయిలో ఉండటంతో.. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీవారిని 78,288 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 32,079 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad