- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా భారత్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా.. ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (173*) డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. సాయి సుదర్శన్ (87) అర్ధశతకంతో రాణించాడు. కేఎల్ రాహుల్ (38) రాణించాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (20*) క్రీజులో కొనసాగుతున్నాడు. రెండు వికెట్లూ జోమెల్ కే దక్కాయి.
- Advertisement -