నవతెలంగాణ-హైదరాబాద్: సిక్కిం రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు భారీ స్థాయిలో తీస్తా నదిలోకి చేరింది. దీంతో ఆ నదిలో ఒక్కసారి నీటిమట్టం పెరిగిపోయింది. వరదనీటి ప్రవాహానికి తీస్తా నది ఉధృతంగా ప్రవాహిస్తుంది. అప్రమత్తమైన ఐఎండీ ఏ క్షణానైనా వరదలు రావొచ్చని శనివారం ముందస్తుగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రతమత్తమైన ఆ రాష్ట్ర ప్రభుత్వం..ఆ నది తీర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించున్నారు.

అంతేకాకుండా మంగన్, గ్యాల్షింగ్, సోరెంగ్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గ్యాంగ్టక్లోని బలువాఖాని నుండి వచ్చిన నౌకాస్ట్ వాతావరణ హెచ్చరిక ఆధారంగా, ఈరోజు ఉదయం 06:15 గంటలకు ప్రారంభమయ్యే 2 నుండి 3 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాలకు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ విపత్కర పరిస్థితులకు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, నిర్భయంగా ఉండి, తగు జాగ్రత్తలు పాటించాలని సిక్కిం సర్కార్ ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు ముప్పు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి క్షణ్ణం పరిస్థితులను తమ ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
