Tuesday, June 24, 2025
E-PAPER
Homeబీజినెస్గల్ఫ్‌కు భారత ఎగుమతులు తగ్గొచ్చు..! : ఎఫ్‌ఐఈఓ

గల్ఫ్‌కు భారత ఎగుమతులు తగ్గొచ్చు..! : ఎఫ్‌ఐఈఓ

- Advertisement -

న్యూఢిల్లీ: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం భారత ఎగుమతుల పైనా ప్రభావం చూపనుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఐఈఓ) పేర్కొంది. ముఖ్యంగా గల్ఫ్‌ ప్రాంతంలో ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గనుందని.. దీంతో సరకు రవాణ పడిపోనుందని తెలిపింది. మరోవైపు రవాణ ఖర్చులు పెరగడంతో పాటు సముద్ర బీమా ప్రీమియంలు భారం కానున్నాయని ఎఫ్‌ఐఇఒ అధ్యక్షుడు ఎస్‌సి రాల్హాన్‌ పేర్కొన్నారు. ముడి చమురు ధరల్లో అస్థిరత ద్రవ్యోల్బణం, లాజిస్టిక్స్‌ ఖర్చులను ప్రభావితం చేస్తుందన్నారు. అయితే ఇది భారతీయ ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి, ప్రాంతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవడానికి ఓ అవకాశమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -