- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పొట్టకూటి కోసం యూఏఈకి వెళ్లి, కష్టాలు పడుతున్న భారతీయ వ్యక్తి మురుగానంద్, సరదాగా కొనుగోలు చేసిన లాటరీ టికెట్తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. తన స్నేహితుడితో కలిసి కొనుగోలు చేసిన టికెట్కు 50 లక్షల దిర్హామ్లు (సుమారు రూ.11.35 కోట్లు) రెండవ బహుమతిగా దక్కింది. ఈ డబ్బుతో తన ఆర్థిక కష్టాలు తీరి, కుటుంబం స్థిరపడుతుందని మురుగన్ ఆనందం వ్యక్తం చేశారు. గెలుచుకున్న మొత్తాన్ని స్నేహితుడితో సమానంగా పంచుకుంటానని తెలిపారు.
- Advertisement -


