Saturday, June 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆ దేశాల్లో భార‌తీయులు అప్ర‌మ‌త్తంగా ఉండండి: ఇండియా ఎంబసీ

ఆ దేశాల్లో భార‌తీయులు అప్ర‌మ‌త్తంగా ఉండండి: ఇండియా ఎంబసీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్:ఇరాన్‌, ఇజ్రాయెల్‌ .. ఉద్రిక్త‌ల‌కు ముగింపు ప‌లికి..సామ‌ర‌స్యంగా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాలి భారత్ విదేశాంగ శాఖ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. “ఉద్రిక్తతలను తగ్గించే చర్యలను నివారించాలని భారతదేశం ఇరుపక్షాలను కోరుతోంది. ప్రస్తుత సంభాషణ, దౌత్య మార్గాల ద్వారా..ఇరుప‌క్షాలు అంతర్లీన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి. రెండు దేశాలతో సన్నిహిత స్నేహపూర్వక సంబంధాలను ఇండియా కలిగి ఉంది. సాధ్యమైన అన్ని మద్దతులను అందించడానికి సిద్ధంగా ఉంది” అని ప్రకటనలో పేర్కొంది.

అదే విధంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో ఈ రెండు దేశాల్లో నివసిస్తున్న భారత పౌరులను ఉద్దేశించి అక్కడి మన ఎంబసీలు అడ్వైజరీలు కీలక సూచనలు చేశాయి. ఎవరూ అవనసర ప్రయాణాలు చేయొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించాయి. ”ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించండి. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్‌ మీడియా ఖాతాలను అనుసరించి తాజా సమాచారం తెలుసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండండి” అని ఇరాన్‌ ఇజ్రాయెల్‌ లోని భారత దౌత్య కార్యాలయాలు తమ అడ్వైజరీలో పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -