Monday, June 9, 2025
E-PAPER
Homeజాతీయంమోడీ నాయ‌క‌త్వంలో భార‌త్ విదేశాంగ‌ విధానం న‌శించింది: ప‌వ‌న్ ఖేరా

మోడీ నాయ‌క‌త్వంలో భార‌త్ విదేశాంగ‌ విధానం న‌శించింది: ప‌వ‌న్ ఖేరా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీజేపీ నాయ‌క‌త్వంలో భార‌త్ విదేశాంగ‌ విధానం న‌శించిపోయింద‌ని కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరా ఆరోపించారు. గ్లోబెల్ ప్రచారంలో ఇండియా ఒంట‌రిగానే మిగిలిపోయింద‌న్నారు. పాకిస్థాన్ దేశానికి వివిధ సంస్థ‌ల నుంచి నిధుల‌ను నిలువ‌రించ‌డంలో..మోడీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. ప్రపంచ బ్యాంకు నుండి $20 బిలియన్, IMF నుండి $1 బిలియన్, ADB నుండి $800 మిలియన్లు నిధుల‌ను పాకిస్థాన్ పొందింద‌ని ఆయ‌న చెప్పారు.

సౌదీ అరేబియా ఇటీవ‌ల ప‌లు దేశాల‌కు వీసా అనుమ‌తుల‌ను బ్లాక్ చేసిందని, ఆ జాబితాలో ఇండియాకు కూడా ఉంద‌ని తెలిపారు. ఇదీ దౌత్య‌ప‌రంగా బీజేపీ ప్ర‌భుత్వం విఫ‌లం చెందింద‌డానికి నిద‌ర్శ‌న‌మ‌ని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా ప‌వ‌న్ ఖేరా రాసుకొచ్చారు. ఖ‌లిస్థాన్ ఏర్పాటు వాదంతో కెన‌డాతో సంబంధాలు స‌న్న‌గిల్లాయ‌ని, అందుకే జీ7 స‌ద‌స్సు ఆహ్వానం మోడీకి ఆల‌స్యమైంద‌ని గుర్తు చేశారు. నేపాల్ లోని కాల‌పాని వివాదంలో ఎటువంటి పుర‌గ‌తి లేద‌న్నారు. మాల్దీవులు, శ్రీ‌లంక దేశాలు చైనాతో బ‌ల‌మైన ద్వైపాక్షిక సంబంధాల‌ను క‌లిగి ఉన్నాయ‌ని వివ‌రించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -