- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండిగో విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ వెల్లడించారు. లక్షలాది మంది ప్రయాణికులకు వారి రీఫండ్లను చెల్లించినట్లు తెలిపారు. చాలావరకు లగేజీలను సైతం వారి ఇళ్లకు డెలివరీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వంతో పూర్తి సహకారంతో పని చేస్తూనే ఉంటామన్నారు. విమాన సేవల తీవ్ర అంతరాయాలకు దారితీసిన పరిస్థితులు, వాటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలపై దృష్టి సారించినట్లు ఓ వీడియో సందేశంలో తెలిపారు.
- Advertisement -



