నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇరుదేశాలు పరస్పరం వైమానిక దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లను, పలువురు శాస్త్రవేత్తలను కోల్పోయింది. ఈక్రమంలో తాజాగా ఇండిగో విమాన సర్వీసు సంస్థ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. పశ్చమాసియాలో తలెత్తిన యుద్ధకారాణాలతో ఇరాన్, ఇరాక్ గగనతలం అందుబాటులో లేదని, పలు విమానాల రాకపోకలు ఆలస్యంగా నడునున్నాయని పేర్కొంది. అంతేకాకుండా నిర్ణయించిన షెడ్యూల్ లో మార్పులు చేర్పులు జరిగాయని ఆ సంస్థ ప్రయాణీకులకు సూచించింది. అదేవిధంగా ఆదేశాల గగనతలం నుంచి కాకుండా ప్రత్యామన్నాయ మార్గాల్లో విమానాల రాకపోకలు సాగించనున్నాయని, ప్రయాణీకులు ఎప్పటికప్పుడు ఇండిగో వెబ్సైట్ ద్వారా తమ సర్వీసు వివరాలను ప్రయాణీకులకు అందుబాటులో ఉంచామని ఇండిగో సంస్థ ప్రకటనలో వెల్లడించింది.
ప్రయాణికులుకు ఇండిగో సంస్థ కీలక ప్రకటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES