Wednesday, June 18, 2025
E-PAPER
Homeజిల్లాలుఅర్హులైన పేదలకు తెల్లరేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి

అర్హులైన పేదలకు తెల్లరేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి

- Advertisement -
  • సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు

నవతెలంగాణ-తుర్కపల్లి: మండల మహాసభ మండల కేంద్రంలో జయం ఫంక్షన్ హాల్లో నాగపురి నరసింహ వసంతల అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా గోదా శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ..100 వసంతాలలోకి అడుగుపెడుతున్న కమ్యూనిస్టు పార్టీ నాటి నుండి నేటి వరకు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని ఆయన తెలిపారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మండలంలో పేదల పక్షాన ఇళ్ల స్థలాల కోసం భూ పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ మహాసభలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిలు గ్రామాల దామోదర్ రెడ్డి, బోలగాని సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, మహిళా సామాజిక జిల్లా ప్రధాన కార్యదర్శి బండి సంజమ్మ, సిపిఐ మండల కార్యదర్శి సిల్వర్ దుర్గయ్య, నాయకులు గుంటుపల్లి సత్తయ్య, వల్ల భగవంతు పాఖీరా నాయక్, జిన్న రజిత, పురుమాని వసంత, కొండ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలో నూతన కమిటీని ప్రకటించారు అంబేద్కర్ నగర్ కార్యదర్శిగా బండారి శాంతమ్మ సహాయ కార్యదర్శిగా బి, వనమ్మ ను, కమిటీ నెంబర్లుగా సుశీల, యాదమ్మ, అండాలు, బాలమణిని ఎన్నుకున్నారు మండల సిపిఐ ఆఫీస్ కార్యదర్శి సత్యం మరియు కృష్ణ లక్ష్మణ్ చెన్నకేశవులు రాములు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -