– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
– ధర్మపురిలో ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ
నవతెలంగాణ – ధర్మపురి
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు. ముందుగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 699 మంది లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఆ తర్వాత ధర్మపురిలోని శ్రీలక్ష్మీనరసింహ కాలనీలో మొదటి ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఇండ్లు కట్టుకునే పేదలకు ప్రభుత్వమే ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తుందన్నారు. సకాలంలో ఇంటి నిర్మాణం చేపట్టి సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని నిర్మాణాలు ప్రారంభించామని చెప్పారు. అధికారులు విచారణ జరిపి నగదును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా ఎవరైనా అర్హత ఉండి ఇల్లు రాని వారు ఉంటే తనను నేరుగా సంప్రదించొచ్చని తెలిపారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES