•ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య కు వినతి పత్రం అందజేత
•సిపిఐ(ఎం ) మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం
నవతెలంగాణ _బొమ్మలరామారం : మండలంలోని అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ర్యకలశ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య కు వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ.. బొమ్మలరామారం మండలంలోని అర్హులైన పేదలందరికీ ఎలాంటి షరతులు లేకుండా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని, ఇందిరమ్మ కమిటీల పేరుతో రాజకీయ జోక్యాన్ని నివారించి అధికారులే అర్హులైన పేదలందరికీ ఇండ్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోర్ చూడడం అనేది నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకం కాకుండా పోతుంది , అధికారులు అట్టి రాజీవ్ వికాస పథకంలో అర్హులైన నిరుద్యోగులకు 6000 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాన్ని అందిస్తామని చెప్తూనే, ఆ పథకంలో సిబిల్ స్కోర్ చూడడం ద్వారా లబ్ధిదారులను సగానికి పైగా తిరస్కరణకు గురి చేసేటట్లు గా ప్రభుత్వ నిబంధన లు తీసుకుని వస్తుంది అట్టి నిబంధనలను తొలగించి లబ్ధిదారులను అన్ని కార్పొరేషన్ల ద్వారా గుర్తించి పారదర్శకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ముక్యర్ల పున్నమ్మ ప్యారారం వెంకటేష్ దేశెట్టి సత్యనారాయణ స్వామి రమేష్ సాయి తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES