- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్ ధోల్పూర్లో బాలింత బంధువులు డాక్టర్పై విచక్షణారహితంగా దాడి చేశారు. బబిత (27) జనవరి 20న ‘భారత్ ఆస్పత్రి’లో బిడ్డకు జన్మనిచ్చింది. డిశ్చార్జ్ అయ్యాక ఆమె ఆరోగ్యం క్షీణించింది. కుటుంబసభ్యులు తిరిగి ఆస్పత్రికి తీసుకురాగా ఆగ్రాకు రిఫర్ చేశారు. 5 రోజుల చికిత్స తర్వాత బబిత చనిపోయింది. దీంతో 20-25 మంది బంధువులు ‘భారత్ ఆస్పత్రి’కి వెళ్లి వైద్యుడిని కాళ్లతో తంతూ, తలపై కొడుతూ బీభత్సం సృష్టించారు.
- Advertisement -



