Saturday, June 7, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాల్లో అన్యాయం

అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాల్లో అన్యాయం

- Advertisement -

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం అభినందించ దగ్గ విషయం. గత దశాబ్ది తెలంగాణలో విద్యావ్యవస్థ అభివృద్ధికి అనేక పరిమి తులు ఏర్పడ్డాయి. ప్రాథ మిక విద్య మొదలు ఉన్నత విద్యవరకు గత ప్రభుత్వం సరైన దృష్టి సారించలేదన్న విషయాన్ని గత ప్రభుత్వాన్ని గద్దె దించి తెలంగాణ సమాజం అర్థం చేయించింది. ఏ సమాజంలో నైనా విద్య మొదటి ప్రాధాన్యత అవ్వాలి. కానీ, మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. కర్ణుని చావుకి సవాలక్ష కారణాలంటూ దీనికి అనేక కారణాలు న్నాయి.కానీ, వర్తమాన సమాజం ఈ పరిస్థితి మారాలని కోరుకుం టున్నది. ప్రపంచీకరణ ప్రభావం, పెట్టుబడి ప్రవాహం వల్ల విద్య ప్రాథమిక హక్కుగా, నైతిక బాధ్యతగా గుర్తించ బడటం లేదు. కేవలం ఒక పారిశ్రామిక రంగంగా తయారైంది. తెలంగాణ రాజధానిగా, మిని ఇండియాగా పిలవబడుతున్న హైదరాబాద్‌లో ఉన్నత విద్య ముఖ్యంగా ప్రయివేటు రంగం చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యపై దృష్టిని కేంద్రీకరించడం లేదు. గత మూడు దశాబ్దాలుగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల దేశవ్యాప్తంగా ఒక అసమ సమాజం ఏర్పడింది. దీనివల్ల పేద, మధ్య తరగతి వర్గాలకు నాణ్యమైన విద్య దూరమైంది, ఈ పరిస్థితి మారాలి.
రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విధి, విధానాలను 4ఏప్రిల్‌ 2025 జీవో నెంబర్‌21 ద్వారా ఖరారు చేసింది. ఇది నియ మించిన ఉన్నతస్థాయి కమిటీ ఈ సిఫారసులను చేసినట్లు, వాటిని ఆమోదించినట్లు ప్రకటిం చింది. నిజానికి ఈ విశ్వవిద్యాలయాల్లో గత ఇరవైయేండ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, పార్ట్‌ టైమ్‌ అధ్యాపకుల స్థానాన్ని నిర్ధారించకుండా రిక్రూట్‌మెంట్‌ ప్రస్తావన తీసుకురావడం ద్వారా గత నెలరోజులుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తమ వుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక జీవో 21ని క్షుణ్ణంగా పరిశీలిస్తే గనుక గతంలో ఉన్న నిబంధనల స్థానంలో మూడు దశల స్క్రూటినీ విధానాన్ని అనుసరిస్తూ విశ్వవిద్యాల యాలు ఖాళీలను భర్తీ చేయాలని ప్రతిపాదించింది. ఈ విధా నాలను ప్రతీ విశ్వవిద్యాలయం తమ పాలకమండలిలో ప్రవేశపెట్టి, ఆమోదించుకోవాల్సి ఉంటు ందని ఉన్నత విద్యామండలి సూచించింది. జీవో నెం. 21 అనుబంధం 1లో ఎ,బి,సి అనే విభజనల్లో స్క్రూటినీ విధా నాలను సూచించింది. ఈ మూడు దశల్లో అభ్యర్థి విషయ పరి జ్ఞానం, సబ్జెక్ట్‌ ప్రెజెంటేషన్‌, రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌, వ్యక్తిత్వాల ఆధా రంగా మార్కులు కేటాయిస్తుంది. ఇది మా ర్కుల విభజన, స్క్రూటినీ విధా నం. ఇది సహజ న్యాయానికి, యూజీసి నిబంధనలకు పూర్తి విరుద్ధం
ఉన్నత విద్యామండలి ప్రతిపాదించిన స్క్రూటినింగ్‌ విధా నాలను లోతుగా గమనిస్తే అనేక లోటు పాట్లు ఉన్నాయనే విషయం అర్థమవు తున్నది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి సంబం ధించి ఇప్పటివరకు రెండు దశల స్క్రూటినీ పద్ధతినే పాటిస్తున్నారు. మొదటి దశలో ఎపిఐ స్కోర్‌ వంద మార్కులు, ఇంటర్వ్యూ, ప్రజం టేషన్‌కి యాభై మార్కులను కేటాయి స్తారు. ఈ పద్ధతినే చాలా వరకు కేంద్రీయ విశ్వ విద్యాల యాలు అనుసరిస్తున్నాయి. కానీ, తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రతిపాదిత కమిటీ రూపొం దించిన ఈ జీవోలో ఈ పద్ధతిని మార్చారు. స్క్రూటినింగ్‌ విధానాన్ని మూడు దశలకు పెంచి, ఎ- 50, బి – 30, సి – 20 అని మార్కులకు పరిమితం చేస్తూ, మిగతా వాటితో కలపకుండా వాటిని కట్టడి చేశారు. ఇది అనాలోచిత నిర్ణయం. ఇక ప్రతిపాదిత ‘ఎ’ దశలో పీహెచ్‌డీకి పది మార్కులు మాత్రమే కేటాయిం చారు. నిజానికి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అసిస్టెంట్‌ ప్రొఫె సర్ల నియామకాల్లో 25 నుండి 30 మార్కులను కేటాయిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే అత్యున్నత డిగ్రీగా పేరు ఉన్న పీహెచ్‌డీ కన్నా, పీజీకి మార్కులు అధికంగా కేటాయించారు. ఇదెక్కడి విధానమో జీవో రూపకర్తలకే తెలియాలి.అలాగే బోధనాను భవానికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా పది మార్కులిస్తున్నారు. అలాగేపోస్ట్‌ డాక్టోరల్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌ షిప్‌లకి సంబంధించి ఐదు మార్కులు వేస్తున్నారు.ఇందులో అభ్యర్థి ముప్తై మార్కుల్లో సాధిం చిన మార్కుల ఆధారంగానే ప్రతి పాదిత సి దశలోకి 1:5 పద్ధతిలో ఎంపిక చేస్తామని ప్రకటించారు. దీనివల్ల నూత నంగా పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు బోధన, పరిశోధా నుభవం విష యంలో తీవ్రంగా నష్ట పోతున్నారు. స్క్రూటినీ అనేది అభ్యర్థి మెరిట్‌ ఆధారంగా జర గాలి కానీ, ఇందులో అనుభవం పేరుతో స్క్రూటినీ జరుగుతుంది. ఇది సహజ న్యాయ సూత్రానికి వ్యతిరేకం. అలాగే ఎటువంటి వివక్షత చూపకుండా సమాన అవకాశాలు కల్పించే భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 16కి ఈజీవో పూర్తి విరుద్ధం. ముప్తై మార్కుల్లో నూత నంగా పీహెచ్‌డీ పూర్తి చేసు కున్న అభ్యర్థి సహజంగానే పదిహేను మార్కులు కోల్పో తాడు. సగం మార్కులు కోల్పోయిన తర్వాత మిగతా పదిహేను మార్కులకు పోటీ పడి తర్వాతి దశలోకి ఎలా వెళ్లగలరు? ఇంత స్పష్టంగా సమస్య అర్థమవు తుంది. అభ్యర్థి మెరిట్‌ను ప్రతి పాదిత స్థానానికి సూచించిన అర్హతల్లో చూడాలి కానీ, అనుభవం ఏనాటికీ మెరిట్‌ కాజాలదు. ఈ అభ్యంతరం పట్ల ఈ జీవో రూపకర్తలు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవ సరం ఉంది. అయినా విశ్వ విద్యాలయ స్థాయి అధ్యాపక స్థితికి మొదటి అడుగు (డోర్‌స్టెప్‌) అయిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్థానా నికి ఎక్స్‌పీరియన్స్‌ని ప్రధానం చేసి, ఈ మార్కుల తోనే స్క్రూటినీ చేస్తామని చెప్పడం అప్రజాస్వామికం.
‘బి’ దశలోకి వచ్చిన అభ్యర్థి మెరిట్‌ని పరిగణలోకి తీసుకోకుండా ”బోధనానుభవం, పరిశోధానుభవం” పేరుతో మార్కులను కేటా యించి, ఇంటర్వ్యూ దశలోకి పంపుతున్నారు. దీనివల్ల బోధన, పరిశోధనలపై మక్కువతో ఉన్న నూతన అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి ప్రతిపాదించిన విధి, విధానాలే అడ్డంకిగా మారు తున్నాయి. వీరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌కి అనర్హులని నూటికి నూరు శాతం ప్రకటిస్తు న్నాయి. యూనివర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్‌ టైం అధ్యాపకుల బోధనానుభవాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. విచిత్రమేమిటంటే యూని వర్సిటీ పరిధిలోని ప్రయివేటు కళాశాలల్లో పని చేస్తున్న వారికి సర్వీసును అంగీకరిస్తూ, మాతృ విశ్వవిద్యాలయాల్లో బోధన చేస్తున్నవారికి సర్వీసును పరిగణలోకి తీసుకోకపోవడం. వర్సిటీ పరీక్ష పెట్టి, ఇంటర్వ్యూ చేసి పార్ట్‌ టైమ్‌ బోధకులను ఎంపిక చేసింది. యూని వర్సిటీలు అధ్యాపకులను ఎంపిక చేసిన ఈ విధానం మంచిది కాదా? తనని తానే దోషి అని పిలుచు కుంటుందా? అనే విషయాలను తేల్చాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ జీవోలో ప్రస్తావిం చిన ‘ఎ’ దశ స్క్రూటినీ విధానం ఆబ్జెక్టివిటీకి దగ్గరగా ఉంది. కానీ, బి, సి దశల్లో కేటాయించిన మార్కుల విషయంలో సబ్జెక్టివిటీ చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఉన్నత విద్యా సంస్థల్లో బాధ్యతాయుతమైన అసిస్టెంట్‌ ప్రొఫె సర్ల నియామకం పారదర్శ కంగా, న్యాయంగా జరగాలంటే ఈ జీవోలోని అంశాలను మరింత పారదర్శకంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే సమాజం కోరుకుం టున్న బాధ్యతాయుతమైన, సుశిక్షిత, ప్రతిభా వంతమైన అభ్యర్థులు బోధకులుగా మారే అవ కాశం ఉంటుంది. కనుక ఇలాంటి అప్రజా స్వామిక, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్న మూడు దశల స్క్రీనింగ్‌ విధానాన్ని, ఇతర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, మెరిట్‌ ఆధారంగా స్క్రూటినీ విధానాలను రూపొందిం చాలి. జీవో నెంబర్‌ 21ని వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి ప్రాతిపదికను తయారు చేయాలి.
– డాక్టర్‌ ఇమ్మిడి మహేందర్‌
9505645706

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -