Sunday, June 15, 2025
E-PAPER
Homeజాతీయంతొమ్మిది బోయింగ్‌ విమానాల్లో తనిఖీలు పూర్తి

తొమ్మిది బోయింగ్‌ విమానాల్లో తనిఖీలు పూర్తి

- Advertisement -

– డీజీసీఏ ఆదేశాల మేరకు మరో 24 విమానాల్లో తనిఖీలు : ఎయిర్‌ ఇండియా
న్యూఢిల్లీ:
తన వద్ద ఉన్న బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్లలో తొమ్మిదింటిలో భద్రతాపరమైన తనిఖీలు పూర్తి చేశామని ఎయిర్‌ ఇండియా సంస్థ శనివారం తెలియజేసింది. డీజీసీఏ ఆదేశాల మేరకు మిగిలిన 24 విమానాలలో కూడా తనిఖీలు పూర్తి చేస్తామని చెప్పింది. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నేపథ్యంలో భద్రతాపరమైన తనిఖీలు పెంచాలని డీజీసీఏ ఇప్పటికే ఆదేశించింది. ఎయిర్‌ ఇండియా వద్ద 26 బోయింగ్‌ 787-8, ఏడు బోయింగ్‌ 787-9 విమానాలు ఉన్నాయి. కొన్ని విమానాల్లో తనిఖీలకు చాలా సమయం పడుతుందని, దీంతో సుదూర ప్రయాణాలలో జాప్యం జరుగుతుందని, ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తామని ఎయిర్‌ ఇండియా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపింది. మరికొన్ని విమానాలు విదేశాలలో ఉన్నందున అవి తిరిగి రాగానే తనిఖీలు చేపడతామని, ఆ తర్వాత తదుపరి ప్రయాణానికి అనుమతిస్తామని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -