Sunday, June 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫక్కిర్ గడ్డలో బొడ్రాయి ప్రతిష్టాపన

ఫక్కిర్ గడ్డలో బొడ్రాయి ప్రతిష్టాపన

- Advertisement -

నవతెలంగాణ-భూపాలపల్లి
 భూపాలపల్లి  మున్సిపాలిటీ పరిధిలోనీ జంగేడు శివారు పక్కీరుగడ్డలో బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ ప్రతిష్టాపన కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. బుధవారం నుండి శనివారం వరకు జరిగే కార్యక్రమాలకు చలువ పందిళ్లు, హెూమ గుండాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజులపాటు కన్నుల పండువగా నిర్వహించేందుకు నిర్వాహకులు అత్యంత వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేయగా శుక్రవారం  ఉత్సవాలు కొనసాగాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ఫకీర్ గడ్డ, ఆకుదారివాడ, కాకతీయ కాలనీ, శ్యామగడ్డ గ్రామాల ప్రజలు సంయుక్తంగా నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ, భూలక్ష్మీ,భూవనేశ్వరుడు (బొడ్రాయి), పోష మ్మశిలవిగ్రహ యంత్ర పునఃప్రతిష్టాన కార్యక్రమం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు మంగళహారతులతో తరలివచ్చి బాలహ నుమాన్, యాగశాల వద్ద పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ కమిటీ సభ్యులు బుర్ర కొమురయ్య గౌడ్ మాట్లాడుతూ…  దేవతామూర్తుల వేశాధారణలో ఊరేగింపు నిర్వహించామని తెలిపారు.  కుంకుమార్చన, హోమములు జరిగాయనీ అన్నారు. 31న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు 25 సంవత్సరాల క్రితం కర్రలతో చేసిన విగ్రహాలను ప్రతిష్టించగా, యధాస్థానంలో శిలా విగ్రహాలను తిరిగి పునః ప్రతిష్టించడం జరుగుతుందన్నారు.  మొదటి రోజు వేడుకల్లో భాగంగా అసుకొల్ల సాంబయ్య బృందం శివుడు, వినాయకుడు, కామాక్షీ,కాళిక దేవి,పార్వతి, గంగ, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, సాయిబాబా వేశాదారణలతో భక్తిభావం పెంపొందించేలా నిర్వహించిన ఊరేగింపు అందర్ని ఆకట్టుకుందన్నారు. ప్రతిష్టాపన కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్టలు, దిష్టికుంభం, అమృత స్నానం, శాంతి కళ్యాణం, బ్రాహ్మణ ఆశీర్వచనం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -