– గిరిజన సంక్షేమ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సివిల్ సర్వీసెస్ పరీక్షలు – 2026 కోసం ఎస్టీ, ఎస్సీ,బీసీ అభ్యర్థు లకు హైదరాబాద్లోని రాజేంద్రనగర్ గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్సియల్ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమ సంచాలకులు శుక్రవారం ఒక ప్రటకటనలో తెలిపారు. అర్హులైన ఆయా తరగతుల అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకో వాలని సూచించారు. అభ్యర్ధులు ఆబ్జెక్టివ్ టైపు, ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.మూడు లక్షలు మించొద్దని తెలిపారు. అభ్యర్థులు http://studycircle.cgg.gov.inలో లాగిన్ అయ్యి శనివారం నుంచి వచ్చే నెల నాలుగు వరకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తు, సూచనలు http://studycircle.cgg.gov.in, http://twd.telangana.gov. in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 6281766534కు పోన్ చేయాలని సూచించారు.
రెసిడెన్సియల్ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES