- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ఇయర్ లో 66.94 శాతం ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్ లో 75.61 శాతం పాసయ్యారు. ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్ , రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 13 నుంచి 20 వరకు అప్లయ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుండి ప్రారంభం కానున్నాయి. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20 వరకు చెల్లించవచ్చు. రెండు సెషన్స్ లో పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 22 న ప్రారంభం కానుండగా రెండు సెషన్స్ లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు.
- Advertisement -



