- Advertisement -
నవతెలంగాణ – నసురుల్లాబాద్ : నసురుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గిరిజన మినీ గురుకులాల్లో ఒకటవ తరగతితో పాటు 5వ తరగతిలో మిగిలిన సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపల్ ప్రియదర్శిని, ఆ సంస్థ రీజియన్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన బాలికలు ఈ నెల 13 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, బోనాఫైడ్ జిరాక్స్ కాపీలను జత చేసిన దరఖాస్తులను సంబంధిత మినీ గురుకులాల్లో అందజేయాలని కోరారు. ఈ నెల 13 న జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతిలో సీట్లను కేటాయిస్తారని పేర్కొన్నారు.
- Advertisement -