- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్కి చేరింది. పంజాబ్తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో పంజాబ్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో 102 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (56* ) అర్ధశతకంతో చెలరేగాడు. కోహ్లీ (12), మయాంక్ (19), పాటిదార్ (15*) రాణించారు. పంజాబ్ బౌలర్లలో కైల్, ముషీర్ చెరో వికెట్ తీశారు.
- Advertisement -