- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ బెదిరింపులకు ఏ మాత్రం లొంగమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే.. హర్మూజ్ను తెరిచేదే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. పవర్ ప్లాంట్లనే లక్ష్యంగా చేసుకుంటే.. హర్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్లోని విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని తెలిపింది. పశ్చిమాసియాలో అమెరికా భాగస్వామ్య కంపెనీలను కూడా పూర్తిగా నాశనం చేస్తామంది.
- Advertisement -



