Wednesday, June 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ సుప్రీం లీడ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు

ఇరాన్ సుప్రీం లీడ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ప‌శ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మ‌ధ్య యుధ్దం ఆరో రోజుకు చేరుకుంది. ఈక్రమంలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇజ్రాయిల్ దేశానికి బ‌ల‌మైన కౌంట‌ర్ ఇస్తామ‌ని, ఆదేశ దాడులకు త‌గ్గిన గుణ‌పాఠం చెప్పుతామ‌న్నారు. “ఉగ్రవాద జియోనిస్ట్ పాలనకు మనం బలమైన ప్రతిస్పందన ఇవ్వాలి. జియోనిస్టుల పట్ల మేము కనికరం చూపము అని ఆయ‌న రాసుకొచ్చారు.

మరోవైపు, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగాయి. అటు టెల్‌ అవీవ్‌లోనూ పేలుళ్లు సంభవించాయి. ఉద్రిక్తతల దృష్ట్యా జెరూసలెంలోని అమెరికా ఎంబసీని శుక్రవారం వరకు మూసివేస్తు్న్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -