- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్కు గట్టి దెబ్బ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది.
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో శనివారం ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో ఆయన మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. దీంతో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఖమేనీ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత ఇరాన్ ఈ మేరకు ధ్రువీకరించింది.
- Advertisement -



