- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. IRCTC సిబ్బంది మధ్య తలెత్తిన చిన్న గొడవ కొద్దిసేపట్లోనే పరిస్థితి అదుపు తప్పి, ఒకరిపై మరొకరు పిడిగుద్దులు, బెల్ట్లు, డస్ట్బిన్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన వందే భారత్ రైలు బయలుదేరే ముందు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ, రైల్వే మంత్రి అశ్వీని వైష్ణవ్కు నెటిజన్లు ఫిర్యాదులు చేశారు. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.
- Advertisement -