- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు.భారత్ తమపై చేస్తున్న సైనిక దాడిని ఇక్కడితో ఆపితే తాము కూడా ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇరుదేశాల మధ్య దాడుల వల్ల పాక్ ఆర్థిక పరిస్థితి కుదేలవ్వడం, ప్రజల పరిస్థితులు అధ్వానంగా మారే ప్రమాదం ఉండడంతో.. ఈ యుద్ధ వాతావరణాన్ని రూపుమాపడం కోసం ఢిల్లీతో చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని పాక్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -