– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
– దాడిని నిరసిస్తూ గోదావరిఖనిలో ర్యాలీ
నవతెలంగాణ-గోదావరిఖని
ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దేశాలు జరుపుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని, శాంతిని నెలకొల్పాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని పార్టీ ఆఫీసు నుంచి ర్యాలీగా వెళ్లి మెయిన్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. ఇరాన్లో రసాయనిక ఆయుధాలు, అణ్వా యుధాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు మోపి ఇజ్రాయిల్ ఇరాన్పై బాంబులతో దాడులకు పాల్పడిందని అన్నారు. ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయో లేవో తెలుసు కోవడానికి అమెరికా సర్వే చేయిస్తే అలాంటిదేమీ లేదని తేలినప్పటికీ ఇజ్రాయిల్తో కలిసి ఇరాన్పై అమెరికా యుద్ధం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.ముత్యం రావు, వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి, ఎం.రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు గణేష్, కొమురయ్య, జ్యోతి, బిక్షపతి, రవీందర్, శైలజ, నాయకులు పాల్గొన్నారు.
ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES