నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయి చేరడంతో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకున్నారు. జీ7 ట్రిప్ నుంచి ఆగమేఘాలపై అమెరికాకు తిరిగొస్తున్నారు. వచ్చీరాగానే భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని వైట్హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ‘‘జీ7 సదస్సులో ట్రంప్ చర్చలు జరిపారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో కీలక ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని అమెరికాకు బయల్దేరనున్నారు’’ అని లీవిట్ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. జీ7 ట్రిప్ నుంచి అమెరికాకు ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES