నవతెలంగాణ-హైదరాబాద్: గాజాలోని నివాస ప్రాంతాలు, ఆసుపత్రులపై విరుచుకుపడుతూ.. ఇజ్రాయెల్ మారణహోమాన్ని సృష్టిస్తోంది. తాజాగా దక్షిణ గాజా ప్రాంతంలోని ఖాన్ యూనిస్ లో మానవతా సాయం తీసుకొచ్చే ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి . ఈ దాడిలో 45 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనేక మంది గాయపడినట్లు పేర్కొంది. క్షతగాత్రులను నాజర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంద
కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. 20 నెలల నుంచి జరుగుతున్న ఈ గాజా పోరులో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 55,104 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో సగానికిపైగా మహిళలు, బాలలు ఉన్నట్లు తెలిపింది. సుమారు 1,24,901 మంది గాయపడినట్లు పేర్కొంది. హమాస్ను అంతమొందించి ఆ ఉగ్రసంస్థ చెరలో ఉన్న బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ సేనలు తెలిపాయి.