- Advertisement -
గాజా: యెమెన్పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు దిగింది. పటిష్టమైన భద్రతా వ్యవస్థను దాటుకుని ఇజ్రాయిల్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్టుపై హౌతీలు ఆదివారం మిసైల్ దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా 30 ఫైటర్ జెట్లతో సోమవారం రాత్రి ఇజ్రాయిల్ యెమెన్పై విరుచుకుపడింది. మరోవైపు సోమవారం తెల్లవారుజాము నుంచే ఇజ్రాయిల్ సైన్యం గాజాపై మారణ హోమం కొనసాగించింది. 51 మంది మరణించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఆహార సరఫరాను ఇజ్రాయిల్ సైన్యం నిలిపివేయడంతో ఆకలి చావులు కొనసాగుతున్నాయి.
- Advertisement -