- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్తో యుద్ధం కారణంగా పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మూసివేసిన గగనతలాన్ని ఇజ్రాయెల్ నేటి రాత్రి నుంచి పరిమిత స్థాయిలో తెరవబోతున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులను స్వదేశాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. గల్ఫ్ దేశాల నుంచి భారతీయులతో పాటు అనేక దేశాల ప్రజలు స్వదేశాలకు చేరుకుంటున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గల్ఫ్లో చిక్కుకున్న భారతీయ పౌరులను స్వదేశానికి తరలిస్తున్నారు.
- Advertisement -



