నవతెలంగాణ-హైదరాబాద్: గురువారం గాజాపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో 31 మంది మృతి చెందినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఇక శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ మరోసారి దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో నిన్నటి కంటే ఎక్కువమందే మృతి చెందే అవకాశం ఉందని మీడియా వర్గాలు భావించాయి. కాగా, ఇజ్రాయిల్ సైన్యం సెంట్రల్ లోని ఓ ఇంటిపైన, ఉత్తర గాజాలోని మరో ఇంటిపైన బాంబు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 9 మంది మృతి మృతి చెందారు. సెంట్రల్ గాజాలోని బురైజ్ శిబిరంలోని ఓ ఇంటిపైనా దాడికి పాల్పడడంతో ఏడుగురు మృతి చెందారని మీడియా వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -