నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ కమ్యూనిస్ట్ పార్టీ ఇరాన్ పై దాడిని తీవ్రంగా ఖండించింది. నెతన్యాహు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని విధ్వంసకర, ప్రమాదకరమైన సంఘర్షణలోకి లాగుతోందని ఇజ్రాయిల్ కమ్యూనిస్ట్ పార్టీ, పార్టీ హడాష్ నేతృత్వంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ ధ్వజమెత్తింది. బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపక్ష మద్దతుతో ఇరాన్ పై విస్తృత దాడిని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ చర్యతో ఇజ్రాయిల్ ను గతంలో కంటే విస్తృత సంఘర్షణలోకి లాగుతోందని మండిపడ్డారు. మొత్తం మధ్యప్రాచ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన యుద్ధాన్ని ప్రారంభించిన ఈ దాడిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఈ పరిస్థితిని ఉపయోగించుకుని వెస్ట్ బ్యాంక్, గాజాలో పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుందని పేర్కొన్నారు. ఈ చర్యకు వ్యతిరేకంగా మొత్తం ప్రపంచం స్పందించాలని కోరారు. విపత్తులను నివారించడానికి అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలని ఇజ్రాయిల్ కమ్యూనిస్ట్ పార్టీ, హడాష్ కూడా అన్ని దేశాలకు పిలుపునిచ్చాయి.
ఇరాన్పై దాడిని ఖండించిన ఇజ్రాయిల్ కమ్యూనిస్ట్ పార్టీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES